Breaking News

చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని


Published on: 25 Jun 2025 14:39  IST

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చింది. యోగాంధ్ర విజయవంతంమైందని కేబినెట్‌లో ప్రధాని ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ యోగాంధ్రను విజయవంతం చేశారని తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌లను కేబినెట్ మంత్రుల ముందు మెచ్చుకున్నారు ప్రధాని.

Follow us on , &

ఇవీ చదవండి