Breaking News

ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేయించాలి..?


Published on: 25 Jun 2025 15:15  IST

స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కి లేదని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని.. అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు.

Follow us on , &

ఇవీ చదవండి