Breaking News

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలి


Published on: 25 Jun 2025 18:56  IST

అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. గత మార్చి నెలలో కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ పురోగతి లేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి