Breaking News

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే తలసాని


Published on: 26 Jun 2025 18:59  IST

బేగంపేట్, జూన్ 26 : ఓల్డ్ కస్ట‌మ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్‌లోని ఓల్డ్ క‌స్ట‌మ్ బస్తీ మొత్తం అధికారులతో కలిసి కాలినడకన పర్యటించారు. ప్రధానంగా బస్తీలో రోడ్లు, సీవరేజ్ సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. రోడ్లు మొత్తం అధ్వాన్నంగా మారాయని, వర్షం కురిస్తే రోడ్లపై నీరు నిలిచిపోతుందని స్థానికులు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి