Breaking News

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పూరీ రథయాత్ర..


Published on: 27 Jun 2025 12:06  IST

ఒడిశాలోని పూరీలో ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ఆరంభమైంది. ఈ విశ్వవ్యాప్త భారీ రథయాత్రకు దేశవిదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పూరీనగర వీధులన్నీ జై జగన్నాథ్! అనే భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భారీ జనసందోహం రాకను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరాన్ని హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి