Breaking News

కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్‌!


Published on: 27 Jun 2025 14:44  IST

విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్‌ నిర్మాణానికి త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడోలైన్‌ ఏర్పాటుకు ఇటీవల సర్వే పూర్తయింది. దీనికి తుది సర్వే పూర్తిచేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను దక్షిణమధ్య రైల్వేకు పంపారు. అక్కడ పరిశీలన అనంతరం రైల్వేబోర్డు ఆమోదం కోసం పంపారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1,200 కోట్లు అవుతుందని అంచనా. రైల్వే లైన్‌కి సర్వేనివేదిక అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి