Breaking News

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!


Published on: 27 Jun 2025 15:16  IST

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ కు సంబంధించిన www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్ కావాలనుకునే విద్యార్థులు జూలై 7 లోపు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి