Breaking News

అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


Published on: 27 Jun 2025 16:11  IST

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కసింకోట మండలం ఉక్కినపాలెం వద్ద జాతీయ రహదారిపై లారీని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి