Breaking News

హైదరాబాద్‌లో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర


Published on: 27 Jun 2025 18:04  IST

భాగ్యనగరంలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌, లోయర్ ట్యాంక్‌ బండ్‌ వద్దనున్న ఇస్కాన్‌ మందిరాల నుంచి వేర్వేరుగా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. నగరవాసులు భారీగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి బయల్దేరిన రథయాత్ర మోండామార్కెట్‌ నుంచి వెళ్తుండగా.. మహిళలు అందమైన రంగవల్లులు వేసి జగన్నాథుడికి స్వాగతం పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి