Breaking News

నదిలో మునిగి ఒకే కుటుంబంలో 18మంది గల్లంతు!


Published on: 27 Jun 2025 18:25  IST

పాకిస్థాన్‌ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 80మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి