Breaking News

Hyderabad |ఎస్పీఆర్ హిల్స్‌లో డెంగీ పాజిటివ్..!


Published on: 27 Jun 2025 19:00  IST

రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్‌లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, వైద్య అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించడంతో పాటు ఎంటమాలజీ సిబ్బంది యాంటీ లార్వా ఆపరేషన్ చేశారు. జీహెచ్ఎంసీ, వైద్య బృందాలు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అవగాహన కల్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి