Breaking News

హైదరాబాద్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..


Published on: 27 Jun 2025 19:05  IST

ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పిజెఆర్ ఫ్లై ఓవర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ ప్రజలకు.. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాదు.. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.ఈ ఫ్లైఓవర్‌ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం(SRDP) కింద రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Follow us on , &

ఇవీ చదవండి