Breaking News

గుర్తించలేని స్థితిలో పాశామైలారం మృతులు..!


Published on: 01 Jul 2025 15:10  IST

పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరో 27 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. మృతులకు ఫార్మా కంపెనీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి