Breaking News

మొబైల్ షాపుకు కన్నం వేసి 5 లక్షల విలువైన ఫోన్లు చోరీ..


Published on: 01 Jul 2025 18:43  IST

హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. ఓ దొంగ మొబైల్ షాపు గోడకు కన్నం వేశాడు. మొబైల్ షాపులోకి ప్రవేశించి రూ.5లక్షల విలువైన ఫోన్లను దోచుకెళ్లిపోయాడు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ దిల్‌సుఖ్‌నగర్-కోఠి మెయిన్ రోడ్డులో ఉన్న బిగ్ సీ షో రూమ్‌ దగ్గరకు వచ్చాడు. మెట్ల వైపు ఉన్న గోడకు ఉలి, సుత్తెతో భారీ కన్నం వేసి దాని గుండా షోరూములోకి ప్రవేశించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి