Breaking News

భోపాల్‌లో సైగల రెస్టారెంటు


Published on: 03 Jul 2025 12:47  IST

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ రెస్టారెంటులో చేతి సైగలతోనే సిబ్బంది వందకు పైగా వెజ్, నాన్‌ వెజ్, మాక్‌టెయిల్స్‌ వెరైటీల్లో వినియోగదారులు కోరుకున్నది క్షణాల్లో ముందుంచుతారు. ఈ నిశ్శబ్ద రెస్టారెంటు పేరు ‘ఎకోస్‌’ అయినా.. అక్కడ ప్రతిధ్వనించేది చక్కటి సంగీతం మాత్రమే. టేబులుపై ఉన్న ఫుడ్‌ మెనూ డైరీని చూసి.. అవసరమైన భోజనాల కోడ్‌లు, ఎన్ని ప్లేట్లు కావాలనేది కస్టమర్లు పెన్నుతో రాస్తారు. సిబ్బంది వాటిని ఇట్టే వడ్డిస్తారు. ఇక్కడ పనిచేసేవారంతా మూగవారు, చెవిటివారు.

Follow us on , &

ఇవీ చదవండి