Breaking News

జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్‌‌ను కలిసిన వంశీ


Published on: 03 Jul 2025 14:52  IST

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు (గురువారం) భేటీ అయ్యారు. వరుస కేసులతో ఐదు నెలలుగా జైలులో ఉన్న వంశీ బెయిల్ రావడంతో నిన్ననే(బుధవారం) జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు తమ అధినేత జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కుటుంబంతో కలిసి జగన్‌ను కలిశారు వంశీ. ఈ సందర్భంగా జైలు జీవితం, తదితర పరిణామాలపై అధినేతతో వంశీ చర్చించినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి