Breaking News

ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి..


Published on: 03 Jul 2025 15:10  IST

తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన ఏపీకి చెందిన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గతంలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ వెండితెరపై విడుదలవుతున్న సినిమాలను ఫోనుతో రికార్డ్ చేసి టెలిగ్రామ్‌ గ్రూపుల్లో షేర్ చేసే స్కామ్‌లోకి దిగాడు. కిరణ్ ఇప్పటివరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. సినిమా విడుదలైన తరువాత రోజే టెలిగ్రామ్‌లో లీక్ చేస్తూ ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడు. నెలకు రూ.80 వేల వరకు సంపాదించేవాడు.

Follow us on , &

ఇవీ చదవండి