Breaking News

ఎక్స్‌ట్రా కప్పులు కోసం షాపు సిబ్బందిని చావగొట్టారు..


Published on: 03 Jul 2025 15:34  IST

వన్ బై టు, వన్ బై త్రీ, టు బై ఫోర్.. ఫ్రెండ్స్‌తో కలిసి టీ తాగడానికి వెళ్లినపుడు ఆ పదాల్ని బాగా వాడుతుంటారు.తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఓ కాఫీ షాపులో ఎక్స్‌ట్రా కాఫీ కప్పుల కోసం గొడవ జరిగింది.ఎక్స్‌ట్రాగా ఖాళీ కప్పులు ఇవ్వనని చెప్పాడు సిబ్బంది దీంతో గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా తయారైంది. వారు అతడిపై దాడి చేశారు. దూరంగా ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు.  సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి