Breaking News

పోలీసులపై రేణుకా చౌదరి అసహనం


Published on: 04 Jul 2025 12:54  IST

గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ కర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేతలు గాంధీ భవన్‌లో ఉండటంతో వారిని కలిసేందుకు కేడర్ క్యూ కట్టింది. ఈ క్రమంలో కేడర్‌ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్డుకున్న వారిలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్టాఫ్ ఉన్నారు. దీంతో ఆమె స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి స్టాఫ్‌ను లోపలికి తీసుకెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి