Breaking News

పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ..ముగ్గురు నిందితుల అరెస్ట్‌


Published on: 08 Jul 2025 18:15  IST

తాను పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువకుడితోపాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్‌కి వెళ్లాడు సంగమేశ్వర్‌ పాల వ్యాపారి. ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తన కుమార్తెకు ఫోన్లో విషయం తెలిపాడు. ఫోన్‌లో మాట్లాడటాన్ని అతడి దుకాణంలో పనిచేసే మహమ్మద్‌ ఆసిఫ్‌ విన్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లోకి వెళ్లి రూ. 3.50లక్షల నగదును తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి