Breaking News

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్


Published on: 08 Jul 2025 18:50  IST

మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 2025, జూలై 8న హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్‎లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రైడ్స్ చేసి టాక్స్ ఆఫీసర్‎ సుధాను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. సుధాపై కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి