Breaking News

అందరూ ఒకే ఫార్మాట్‌లో నివేదికలెలా ఇచ్చారు


Published on: 09 Jul 2025 15:18  IST

స్టేషన్‌ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్‌డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఎస్‌డీపీవోలందరూ ఒకే ఫార్మాట్‌లో నివేదికలు ఎలా సమర్పించారని ప్రశ్నించింది. నోడల్‌ అధికారుల సంతకాలకు బదులు ఇతర అధికారులు సంతకాలు చేశారని తెలిపింది. ఓ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా విజయవాడ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది.

Follow us on , &

ఇవీ చదవండి