Breaking News

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..!


Published on: 10 Jul 2025 14:12  IST

యెమెన్‌లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈనెల 16న ప్రియకు ఉరిశిక్ష అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై నమోదైన పిటిషన్‌ను విచారించేందుకు తాజాగా అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం లో పిటిషన్‌ దాఖలైంది.

Follow us on , &

ఇవీ చదవండి