Breaking News

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి


Published on: 10 Jul 2025 14:18  IST

జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‍ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి