Breaking News

జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..


Published on: 11 Jul 2025 14:52  IST

జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్‌ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్‌ చానళ్లు, డిజిటల్‌ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ క్రమంలో అక్రిడిటేషన్‌ ఉన్న వారిని వారానికి ఒకసారి అనుమతించాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు ఓ సభ్యుడు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి