Breaking News

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి


Published on: 14 Jul 2025 12:03  IST

ఆంధ్రప్రదేశ్‌లో లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన ఇవాళ(సోమవారం, జులై14)న ఉదయం రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. తొమ్మిదిమంది మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి