Breaking News

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన


Published on: 05 Aug 2025 14:24  IST

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ(మంగళవారం) ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కీలక నేతలు చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి