Breaking News

హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు


Published on: 03 Sep 2025 14:51  IST

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు నమోదు అయింది. కోకాపేటలోని విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. మూడు వేర్వేరు సందర్భాలలో తనను దూషిస్తూ దాడి చేశారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. 2016లో హీరో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో విల్లా కొనుగోలు చేశానని, వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చి నెలలో రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేశాడని లావణ్య తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి