Breaking News

రైతులను మరిస్తే..త్యాగాన్ని మరిచినట్టే: చంద్రబాబు


Published on: 13 Oct 2025 12:59  IST

అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని.. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి