Breaking News

నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం


Published on: 14 Oct 2025 14:38  IST

సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ మంగళవారం లీక్ అయింది. తనకు కాల్ చేయాలని జనార్దన్ రావుకు జోగి రమేశ్ మెసేజ్ పెట్టారు. జోగి రమేశ్ ఆదేశాలతోనే గతంలో సైతం నకిలీ మద్యం తయారు చేసేవాడినని చెప్పారు.కానీ ప్రభుత్వం మారిన తర్వాత నకిలీ మద్యం తయారీని తాను నిలిపి వేసినట్లు జనార్దన్ రావు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి