Breaking News

ఆసిఫ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది


Published on: 21 Oct 2025 17:55  IST

నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఘటనలో, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడిన ఆసిఫ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ తెలిపారు. ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, ఆసిఫ్‌ను గ్యాలంట్రీ మెడల్‌కు సిఫార్సు చేస్తామని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి