Breaking News

బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి


Published on: 27 Oct 2025 14:31  IST

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో నేటితో మృతదేహాల అప్పగింత పూర్తి అయ్యింది. ఈరోజు (సోమవారం) ఉదయం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ (29) మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు. కర్నూలు ఎమ్మార్వో ఆంజనేయులు, పోలీసుల సమక్షంలో కర్నూలు స్మశాన వాటికలో ప్రశాంత్ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహాలను డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి