Breaking News

పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే


Published on: 28 Oct 2025 17:16  IST

రాష్ట్రంలో రేపటి (బుధవారం) నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,100గా నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి