Breaking News

మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు


Published on: 29 Oct 2025 17:59  IST

 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఇవాళ (బుధవారం) జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం కురుస్తోండటంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి.ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇవాళ(బుధవారం) 49, రేపు(గురువారం) 6 రైళ్లు రద్దు చేస్తునట్లు ప్రకటించారు. 

Follow us on , &

ఇవీ చదవండి