Breaking News

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ప్రాణభయం పట్టుకుంది


Published on: 06 May 2025 17:36  IST

పహల్గామ్‌ దాడివెనక పాక్, లష్కరే తొయిబా హస్తం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేల్చడంతో హఫీజ్ సయీద్‌కు ప్రాణభయం పట్టుకుంది. పాకిస్తాన్‌లో ఉంటున్న హఫీజ్ ప్రాణ రక్షణకు తరచుగా నివాసాన్ని మార్చుతున్నాడు. హఫీజ్‌కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అండగా నిలుస్తోంది. హఫీజ్‌ను ఇటీవల లాహోర్‌లోని మియాన్మెర్ కంటోన్మెంట్ ఏరియాలో కొత్త ఇంటికి తరలించింది ఐఎస్ఐ. పహల్గామ్ దాడికి ప్రతిగా హఫీజ్‌ను చంపడానికి భారత్ కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభిస్తుందని ఐఎస్ఐ భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి