Breaking News

విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్


Published on: 18 Nov 2025 15:05  IST

మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి