Breaking News

రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..


Published on: 20 Nov 2025 12:23  IST

నగరంలోని పటమట రైతు బజార్‌ను కలెక్టర్ లక్ష్మీ శా ఈరోజు (గురువారం) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్‌లో ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. రైతు బజార్‌లో బాగానే పరిశుభ్రత పాటిస్తున్నారని, ఇంకా బాగా చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం లక్ష్మీ శా మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా రైతు బజార్‌లు, మార్కెట్‌లు తనిఖీ చేస్తున్నామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి