Breaking News

4 ప్రయాణికులు సజీవ దహనం


Published on: 08 May 2025 12:02  IST

చార్‌ధామ్ యాత్ర కోసం బయల్దేరిన హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఈ మేరకు గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రమాదాన్ని ధృవీకరించారు. ఉత్తరకాశి జిల్లాలోని గంగానిలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, పరిపాలన, NDRF-SDRF బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయి.

Follow us on , &

ఇవీ చదవండి