Breaking News

రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్


Published on: 21 Nov 2025 11:29  IST

రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు మంత్రి నారాయణ. మూడేళ్లలో రాజధాని నిర్మాణ  పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు పూర్తి అయ్యాయన్నారు. ఇంకా కేవలం 2270 మంది రైతులకు 7988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు.ఒకరిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు పెట్టారని అన్నారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదని తేల్చిచెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి