Breaking News

చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం..


Published on: 21 Nov 2025 16:11  IST

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. 11 సీబీఐ, 9 ఈడీ చార్జిషీట్లు ఉన్న జగన్.. కోర్టుకు హాజరైన తీరు 'చావుకి, పెళ్ళికి ఒకే భజంత్రి' అనే సామెతను గుర్తు చేసిందంటూ ఎద్దేవా చేశారు. గతంలో సీనియర్ నాయకులు లాలూ, పీవీ నరసింహారావు నిరాడంబరంగా కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పంథా మార్చారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి