Breaking News

తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పొడపాటి కావ్య (15) అనే విద్యార్థిని తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన 2025 నవంబర్ 21 (శుక్రవారం) మధ్యాహ్నం జరిగింది. 


Published on: 21 Nov 2025 16:50  IST

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పొడపాటి కావ్య (15) అనే విద్యార్థిని తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన 2025 నవంబర్ 21 (శుక్రవారం) మధ్యాహ్నం జరిగింది. 

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణం, గురుకుల పాఠశాల లో పొడపాటి కావ్య (15), జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామానికి చెందినది.పాఠశాలలో భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులందరూ భోజనం చేసేందుకు వెళ్లగా, కావ్య ప్లేట్ తెచ్చుకునేందుకు తిరిగి తరగతి గదికి వెళ్లింది. చాలాసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా, ఆమె చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి