Breaking News

భారత పర్యటన రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని..


Published on: 25 Nov 2025 12:52  IST

నెతన్యాహు.. చివరిసారిగా 2018లో భారత్‌కు విచ్చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది పర్యటించాలనుకోగా.. పలు కారణాలతో రద్దవుతూనే ఉంది. సెప్టెంబర్ 9వ తేదీనే ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. అయితే.. అక్కడ బిజీ షెడ్యూల్ ఉండటంతో రాలేకపోయారు. తాజాగా డిసెంబర్ నెలలో ప్రధాని మోదీతో సమావేశం కావాల్సి ఉండగా.. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా మరోసారి రద్దైంది. ఇక ఈ ఏడాది ఆయన.. భారత్‌లో పర్యటించే అవకాశాలు సన్నగిల్లాయి. 2026లో ఆ దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి