Breaking News

మోడీ నివాసానికి అజిత్ దోవల్


Published on: 08 May 2025 23:10  IST

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైళ్లతో వరుస దాడులకు పాల్పడుతోంది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. జమ్మూ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో రక్షణశాఖ అలర్ట్ అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో చర్చించారు. ప్రధాని మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో సమావేశమై తాజా పరిస్థితిపై పూర్తి నివేదిక అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి