Breaking News

సర్పంచ్‌ పదవికి రూ.73లక్షలు


Published on: 01 Dec 2025 12:21  IST

సర్పంచ్‌ స్థానానికి వేలంపాటలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని బంగారిగెడ్డ, ములకలపల్లి సర్పంచ్‌ స్థానాలు వేలంపాటల ద్వారా ఏకగ్రీవం అయ్యాయి. చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్‌ పదవిని మహ్మద్‌ సమీనా ఖాసిం అనే మైనార్టీ మహిళ ఏకంగా రూ.73లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. బంగారిగడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఆదివారం గ్రామపెద్దల సమక్షంలో వేలం జరిగినట్టు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి