Breaking News

రూ.కోటి ఇస్తే 11 వేల ఓట్లు!..


Published on: 01 Dec 2025 14:58  IST

మహారాష్ట్రలో మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, చంద్వాడ్‌లో ఒక ఆడియో క్లిప్‌ సంచలనం సృష్టించింది. ‘మేము ఈవీఎం  మెషీన్‌ ఆపరేటర్‌తో మాట్లాడాం. మీరు రూ.కోటి ఇస్తే, మీకు 11,250 ఓట్లు వేయిస్తాం’ అని పేర్కొంటున్న స్వతంత్ర అభ్యర్థి రాకేశ్‌ అహిరే ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు పిర్యాదు చేయడంతో చంద్వాడ్‌లో రాజకీయ వాతావరణం వేడెకింది. స్వతంత్ర అభ్యర్థి రాకేశ్‌ అహిరే ఈ క్లిప్‌ను బయటపెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి