Breaking News

బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..


Published on: 03 Dec 2025 14:29  IST

నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. నాంపల్లిలోని పీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మరోవైపు గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Follow us on , &

ఇవీ చదవండి