Breaking News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..


Published on: 09 May 2025 13:38  IST

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం దలాల్‌ స్ట్రీట్‌పై బలంగా పడింది. దాంతో శుక్రవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుంగిపోగా.. నిఫ్టీ 24వేల మైలురాయిని కోల్పోయింది. ఉదయ 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 919.49 పాయింట్లు దిగజారి 79,416.32 వద్ద, నిఫ్టీ 295.1 పాయింట్లు పతనమై 23,978.70 వద్ద కొనసాగుతున్నాయి. యుద్ధ భయాలతో మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి