Breaking News

లారీని ఢీ కొన్న బైక్‌.. రైల్వే ఉద్యోగి మృతి


Published on: 03 Dec 2025 18:57  IST

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో జేఈఈగా పనిచేస్తున్న భగవత్ అనే వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి