Breaking News

లొంగిపోయిన వంశీ అనుచరుడు ‘కోట్లు’


Published on: 09 Dec 2025 11:21  IST

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్‌ కోట్లు పోలీసులకు సోమవారం లొంగిపోయాడు. పోలీసులు అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి పి.భాస్కరరావు ఈనెల 15 వరకు రిమాండ్‌ విధించారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌లో వంశీ ప్రణాళికను అమలు చేసిన కోట్లును కేసులో ఏ2గా చేర్చారు. ఈకేసులో ఇటీవలే ఇద్దరు నిందితులు ఏ6 వజ్రకుమార్‌, ఏ3 తేలప్రోలు రాము కోర్టులో లొంగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి