Breaking News

మేడారం మాయాదేవరల పరిరక్షణపై ఆందోళన


Published on: 11 Dec 2025 14:07  IST

గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క - సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది. ఈసారి జనవరి 28 నుంచి నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.కాలక్రమేణా మాయగుప్పాలు (కంకపొదలు) అంతరించి పోతుండటంతో మాయాదేవరల ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి